సిద్ధార్థ్,ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మిస్ యు’.ఈ సినిమాకి ఎన్.రాజశేఖర్ దర్శకత్వం వహించాడు.గత నెలలో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలైంది.అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ప్రకటించింది.
సినిమా డైరెక్టర్ అవ్వాలంటూ కలలు కనే యువకుడు వాసు (సిద్ధార్థ్). ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెప్పే ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అంతలోనే ఓ ప్రమాదానికి గురై తన జీవితంలో చివరిగా గడిచిన రెండేళ్ల జ్ఞాపకాలను మర్చిపోతాడు. దీంతో కోలుకున్న వాసు అనుకోకుండా కలిసిన బాబీ (కరుణాకరన్)తో కలిసి బెంగళూరు వెళతాడు. అక్కడ కేఫ్లో పనిచేస్తున్న సమయంలో సుబ్బలక్ష్మి (ఆషికా రంగనాథ్)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు.అయితే ఆమె మాత్రం తన లవ్ను రిజెక్ట్ చేస్తుంది.తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పి ఎలాగైనా సరే సుబ్బలక్ష్మిని ఒప్పించాలని తిరిగి ఇంటికి వస్తాడు వాసు.కానీ ఆమె ఫొటో చూసిన కుటుంబ సభ్యులు,స్నేహితులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.లక్ష్మితో పెళ్లి కుదరదని,ఆమెను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలని అంటారు.అయినా సరే తననే పెళ్లి చేసుకుంటానని మొండిగా ఉంటాడు వాసు.ఇంతకీ అసలు సుబ్బలక్ష్మితో వాళ్ల ఫ్యామిలీ పెళ్లి ఎందుకు వద్దంటుంది? ఇంతకీ ఆమె ఎవరు? వాసుకీ,ఆమెకీ గతంలో ఏం జరిగింది? ఇటువంటి విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.