ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని అన్నారు ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్.ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఎల్అండ్టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్లైన్లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు.దీనికి సమాధానంగా…ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను.మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను.ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను.ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఆయన తీరును వారు తప్పు పడుతున్నారు.
ఎంతసేపు భార్య ముఖం ఏం చూస్తారు..? : ఎల్అండ్టీ చైర్మన్ పై నెటిజన్స్ ఫైర్
By admin1 Min Read