కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం మరో తీపి కబురు అందించింది. 8వ వేతన సంఘం(పే కమిషన్ ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1 నుండి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు పేమెంట్లు పెరగనున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఇక శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో ఈ మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనున్నారు.శ్రీహరికోటలో ఇస్రో తదుపరి తరం ప్రయోగాల కోసం, స్టాండ్బై లాంచ్ ప్యాడ్గా,భవిష్యత్ భారతీయ మానవ అంతరిక్ష యాత్రల కోసం ప్రయోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు