ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే విధంగా తమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈక్రమంలో ప్రధాని మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్ లేఖ రాశారు. దేశ రాజధాని పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కు 50 శాతం టికెట్ రాయితీని అమలుచేయాలని ప్రతిపాదించారు. రాయితీ కారణంగా పడే భారాన్ని రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం సగం సగం భరించాలన్నారు.
ఢిల్లీ విద్యార్థులకు సంబంధించి ముఖ్యమైన విషయాన్ని దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలకు వెళ్లి వచ్చే క్రమంలో విద్యార్థులు మెట్రోపై ఆధారపడుతున్నారు. వారిపై ఆర్థిక భారం తగ్గించేందుకు 50 శాతం రాయితీ అందించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళా ప్రయాణికులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తోన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోడీకి మాజీ సీఎం కేజ్రీవాల్ లేఖ
By admin1 Min Read