విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన విడుదల చేశారు. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ కింద ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్యాకేజీ: కేంద్రం కీలక నిర్ణయం
By admin1 Min Read

