భారత్ లో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఈ నెల 25 జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తాజాగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల వివరాలను తెలిపింది. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఆ సంఖ్య ఈ ఏడాదికి వచ్చే సరికి భారీగా పెరిగింది. ఇక ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 సంవత్సరాల మధ్య వయసున్న యువత ఉన్నారు. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ, పురుష ఓటర్ల రేషియోలో తేడా కూడా తగ్గిపోయింది. అప్పుడు ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా ప్రస్తుతం అది 954కు పెరిగింది. ఇక మహిళా ఓటర్లు 48 కోట్లుగా ఉంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

