వయనాడ్ జిల్లాలో ఇటీవల ఓ మహిళపై పెద్ద పులి దాడి చేసి చంపిన ఘటన కేరళలో సంచలనం రేపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళపై దాడి చేసిన పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటించిన ప్రభుత్వం.. అది కంటపడితే చంపేయాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ఈ ప్రకటన చేశారు.
వయనాడ్లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళలపై ఇటీవల పెద్దపులి దాడి చేసింది. అనంతరం ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారి జయసూర్యపైనా పులి దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటం, ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.