ఏపీ ప్రభుత్వం బి.పి.ఎల్ (దారిద్య్రరేఖకు దిగువన) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పలు అర్హత నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. పదేళ్ల కాలపరిమితితో ప్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇంటిపట్టా తీసుకున్న రెండేళ్లలోపు నిర్మాణం చేపట్టాలని అలాగే లబ్దిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో కూడా లబ్దిదారుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
బి.పి.ఎల్ కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
By admin1 Min Read