అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలు వలన ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు. పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించిన్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ఇటీవల దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబును చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి హామీ ఇచ్చారన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు