ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా లో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యాలో రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.దీనిపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ…సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు.భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన,విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు.భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్లో ప్రస్తావించారు.ఈ వ్యాజ్యం నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాల్సి ఉంటుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు