ఏపీ మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళాలో స్నానమాచరించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో వీరు పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్కడి నుండి బయల్దేరి వారణాసికి చేరుకుని అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాసేపట్లో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం వారణాసి నుండి విజయవాడకు తిరిగి బయలుదేరతారు. ఈ నెల 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుండి సైతం భక్తులు తరలి వచ్చి ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు