ఇజ్రాయెల్లో మారణహోమాన్ని సృష్టించి యుద్ధానికి కారణమైన హమాస్ సంచలన ప్రకటన చేసింది.ఈ మేరకు గాజా స్ట్రిప్ పై అధికారాన్ని వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.ఈజిప్ట్ ఒత్తిడితో గాజాలోని అధికారాన్ని పాలస్తీనాకు అప్పగించేందుకు హమాస్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ‘స్కై న్యూస్ అరేబియా’ ఓ కథనంలో పేర్కొంది.గాజాలో ప్రస్తుతం పోలీస్,ఆరోగ్యం,పౌరసేవలు అన్నీ హమాస్ నియంత్రణలోనే ఉన్నాయి.తాజాగా అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించేందుకు అంగీకరించింది.హమాస్ నిర్ణయం వెనక డొనాల్డ్ ట్రంప్ విధానం కూడా ఒక కారణమని చెబుతున్నారు.పాలస్తీనా అథారిటీ అనేది ప్రపంచం గుర్తించిన ప్రభుత్వం.1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ను ఇది పాలిస్తోంది.వెస్ట్బ్యాంక్,గాజా అనేవి రెండు పాలస్తీనా భూభాగాలు.2007 నుండి హమాస్ గాజాను పాలిస్తోంది.ఏడాదికిపైగా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తుండగా,ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది.
Previous Articleఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్
Next Article పేరు మారిస్తే డబ్బులు: వికీపీడియాపై ఎలాన్ మస్క్