హర్యానాలోని రోహ్తక్లో ఓ సూట్కేసులో యువతి మృతదేహం లభ్యమైంది.అయితే సంప్లా బస్స్టాండ్లో ఓ పెద్ద సూట్కేసులో యువతి మృతదేహాన్ని గుర్తించారు.కాగా బాధితురాలికి 20 నుండి 22 ఏళ్లు ఉంటాయని పోలీసులు నిర్ధారించారు.మెడచుట్టూ స్కార్ఫ్ ధరించగా, చేతులకు గోరింటాకు పెట్టుకుంది.కాగా ఆమెను హత్య చేసి ఇలా రోడ్డుపై వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటన హర్యానాలో రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది.మృతురాలు తమ పార్టీ కార్యకర్త అని కాంగ్రెస్ పేర్కొంది.హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ భూషణ్ బాత్రా మాట్లాడుతూ…బాధిత యువతి హిమానీ నర్వాల్ అని,ఆమె రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొందని తెలిపారు.హర్యానా ఎన్నికల సమయంలో భూపీందర్ హుడా, దీపీందర్ హుడాలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు.