ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మిర్చి రైతుల ఆందోళనపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.ఈ మేరకు అయన మండలిలో మాట్లాడుతూ…మిర్చి రైతుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.కాగా గత ప్రభుత్వ హయాంలో గుంటూరు మిర్చి యార్డులో అవినీతి జరిగిందని ఆరోపించారు. అయితే మిర్చి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశామని… ఆయన మిర్చి ధరలపై ఎగుమతిదారులు,రైతులతో చర్చించారని అచ్చెన్నాయుడు తెలిపారు.మిర్చి రైతులకు లబ్ధి చేకూరేలా…కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ సీఎం చంద్రబాబు చర్చించారని పేర్కొన్నారు.
వైసిపి హయాంలో గుంటూరు మిర్చి యార్డులో అవినీతి జరిగింది :- మంత్రి అచ్చెన్నాయుడు
By admin1 Min Read

