తన సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల సమయంలో తాను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చిన విషయం గుర్తు చేసుకున్నారు. సామర్లకోట-ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి, ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసి అండగా నిలిచిన ప్రధాని మోడీ, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నట్లు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Previous Articleజపాన్ ప్రతినిధి బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..!
Next Article వినోదభరితంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్