ముంబయిలో మారణహోమం సృష్టించిన 26/11 ఉగ్రదాడి కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్ తన దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శించి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 2009 నుంచి యూఎస్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను అమెరికా నుండి తీసుకువచ్చిన ప్రత్యేక విమానం నిన్న దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. వెంటనే రాణాను నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. కాగా, అమెరికాలో యూఎస్ మార్షల్స్ రాణాను భారత్ కు అప్పగిస్తున్న దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది.
Previous Articleపూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
Next Article రేపు ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల