ట్రై యాంగిల్ వన్డే సిరీస్ లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయంతో ఘనంగా ఆరంభించింది. శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ను వర్షం కారణంగా ఇన్నింగ్స్ ను 39 ఓవర్లకు కుదించారు. మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 147 (38.1) పరుగులకే కుప్పకూలింది. హాసిని పెరీరా (30), కనీషా (25) పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు, శ్రీ చరణి 2 వికెట్లు, దీప్తి 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో భారత్ ప్రతీక రావెల్ (50 నాటౌట్), స్మ్రతి మంథాన (43), హార్లీన్ డియోల్ (48 నాటౌట్) రాణించారు. భారత్ తన తదుపరి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు