Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. ఎప్పటికీ మనదే: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్
    రాజకీయం

    కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. ఎప్పటికీ మనదే: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్

    By adminApril 29, 20252 Mins Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    జమ్మూ & కాశ్మీర్ లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ, జనసేన పార్టీ మంగళగిరి లోని CK కన్వెన్షన్ లో ధోనీసేన పార్టీ నాయకత్వంతో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు.26 మంది మృతులకు నివాళులు అర్పించారు. అందులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన రావు మృతి చెందటం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ.50 లక్షలు పరిహారం ప్రకటించారు. ఉగ్రవాద దాడికి దీటైన సమాధానం ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం బలంగా చెబుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిరాయుదులపై ఎప్పుడూ ఎవరూ దాడి చెయ్యరు, కానీ పహల్గాం లో పర్యాటకులపై క్రూరంగా దాడి చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్ లను తరిమికొట్టారు, ఊచకోత కోశారు. 1986 సమయంలో షూటింగ్ ల కోసం వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది, 1989 సమయంలో దాడులు తీవ్రస్థాయికి వెళ్లాయని పేర్కొన్నారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఎప్పటికీ భారతదేశానిదే, కశ్యప ముని పేరు మీద ఏర్పడిన ప్రాంతం కాశ్మీర్, అమర్ నాథ్ నెలవైన ప్రదేశం, శంకరాచార్య నడిచిన ప్రాంతమని తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతీ చర్యకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. వారు తీసుకున్న నిర్ణయాలను అందరూ గౌరవించాలని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు ఈ ఉగ్రవాద దాడిని కూడా ఖండించకుండా పాకిస్తాన్ ను ప్రేమిస్తాం, హిందువులపై మతం ఆధారంగా దాడి కాదు అని అంటారు, సత్యాన్ని చెప్పడానికి కూడా మీకు రాజకీయాలా? కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ మాటలు మాట్లాడుతున్నారు, మీరు భారతీయులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం లేదా, ఇతర మతాల మీద దాడి జరిగినప్పుడే గుర్తొస్తుందా? హిందువులపై దాడి జరిగినప్పుడు గుర్తుకు రాదా? ఏ మతం పై దాడి జరిగినా సరే మనం ఖండించాలని అన్నారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఆకట్టుకుంటున్న ‘సింగిల్’ ట్రైలర్… మరోసారి కామెడీ ఎంటర్టైనర్ తో శ్రీ విష్ణు
    Next Article పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ ప్రధానికి లేఖ రాసిన రాహుల్ గాంధీ

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.