గుజరాత్ లో ఆసియా సింహాల సంతతి భారీగా పెరిగింది. గతంలో 674 సింహాలు ఉండేవని అయితే ఇప్పుడు ఆ సంఖ్య 891కి చేరిందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. సింహాల జనాభాపై నిర్వహించిన 2025 గణాంకాలను విడుదల చేశారు. గిర్ సోమనాథ్, జునాఘడ్, రాజ్ కోట్, భావ్ నగర్, మోర్బి, సురేంద్ర నగర్, ద్వారకా, దేవభూమి, జామ్ నగర్, పోరుబందర్, అమ్రేలి, బోటాడ్ జిల్లాల్లో ఈ సింహాలు విస్తరించాయని తెలిపారు. ఈనెలలో సింహాల జనాభా గణనను జోనల్, సబ్-జోనల్ అధికారులు, ఎన్యుమరేటర్ లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్ లు, ఇన్స్పెక్టర్ లు సహా 3000 మంది వాలంటీర్ల సహాయంతో నిర్వహించినట్లు సీఎం తెలిపారు . వాటి సంరక్షణ, పర్యవేక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు