రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ్నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. యూపీలో 19, మహారాష్ట్రలో 15, గుజరాత్ లో18, తెలంగాణలో 3, ఏపీలో 1, రాజస్థాన్లో 8 రైల్వేస్టేషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. అంతకుముందు బికనీర్లోని కర్ణిమాత ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు.. ప్రధానికి అందజేశారు. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్ను ప్రధాని మోడీ సందర్శించారు. బికనీర్ సమీపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
By admin1 Min Read