దేశానికే గర్వకారణమైన త్రివిధ దళాల అధిపతులను ఐపీఎల్ ఫైనల్ కు ఆహ్వానించినట్లు బీసీసీఐ తాజాగా తెలిపింది. ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఆ సందర్భంగా టోర్నీ ముగింపు కార్యక్రమం కూడా ఉండనుంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సాయుధ దళాలకు అంకితమివ్వనున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. “ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో ఉత్సవం జరపడానికి త్రివిధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులు, సైనికులను ఐపీఎల్ ఫైనల్ కు ఆహ్వానించాం. మన హీరోలకు గౌరవ సూచకంగా ముగింపు కార్యక్రమాన్ని సాయుధ దళాలకు అంకితమివ్వాలని నిర్ణయించామని పేర్కొన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు