సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం ఎస్ఐపీబీ తెలపనుంది. రూ.28,546 కోట్లు పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అనుమతులు క్లియర్ చేయాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సమావేశంలో సీఎస్ విజయానంద్, మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మంత్రులు కందుల దుర్గేష్,అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్, అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం
By admin1 Min Read