ఇరాన్ -ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సింధు’ పేరిట ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. 1117 మందిని భారత్ కు తీసుకొచ్చింది. తాజాగా 290 మంది ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో స్టూడెంట్స్, టూరిస్ట్ లు ఉన్నారు. ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆపరేషన్ సింధు లో భాగంగా పొరుగు దేశాలకు కూడా భారత్ ఆపన్న హాస్తం అందిస్తోంది. నేపాల్, శ్రీలంక వాసులను కూడా తరలిస్తోంది. ఇరాన్ లోని భారతీయులు +989010144557, +9891281091, +989128109109 అత్యవసర నంబర్లనుగానీ, టెలిగ్రామ్ ఛానల్ ద్వారాగానీ అక్కడి దౌత్య కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది.
ఇరాన్ నుండి కొనసాగుతున్న భారతీయుల తరలింపు: కేంద్ర విదేశాంగ శాఖ
By admin1 Min Read