సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీ ప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తెస్తామని మరో 3-4 నెల్లలో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 రూట్లలో నడిపేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద పున్నమి ఘాట్ కు సీ ప్లేన్ చేరుకుంది. ఇందులో సీఎం చంద్రబాబు ప్రయాణం చేయనున్నారు. దీంతో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది కూర్చునేలా సీ ప్లేన్ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించి సీఎం శ్రీశైలానికి చేరుకోనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొంటున్నారు.
సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read