అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలకు తోడు భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ గత ట్రేడింగ్ సెషన్ లో లాభాల బాట పట్టినా నేడు మరోసారి తన నష్టాల పరంపరను కొనసాగించాయి. దీంతో మదుపర్లకు నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం లాభాలలో ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 76,802.73 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 422 పాయింట్ల నష్టంతో 77,155 వద్ద ముగిసింది.నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 168 పాయింట్ల నష్టంతో 23,349 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం రూ. 84.52 వద్ద కొనసాగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు