ఏపీ అసెంబ్లీ ఫైనాన్షియల్ కమిటీలలో భాగంగా పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ మరియు ప్రభుత్వ సంస్థల కమిటీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను శాసన సభ నుండి సభ్యులను ఎన్నుకున్నారు.
రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్లో జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఓటింగ్ కు దూరంగా ఉంది.
అసెంబ్లీలో ఆనవాయితీగా ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి అప్పగిస్తారన్న ఉద్దేశంతో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే శాసనసభలో వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభ్యుల విజయానికి అవసరమైన బలం లేకపోవడంతో కూటమి నుండి ఎమ్మెల్యేలు బరిలో నిలిచారు.
ఈ కమిటీల్లో సభ్యులుగా ఎన్నిక అవ్వాలంటే 20 ఓట్లు రావాలి. కానీ వైసీపీకి శాసనసభలో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసినా ఓటింగ్ కు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు తర్వాత కమిటీల వారీగా ఎన్నికైన సభ్యుల పేర్లను అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
ప్రజా పద్దుల కమిటీ సభ్యులు:
నక్కా ఆనంద బాబు, ఆరిమిల్లి రాధాకృష్ణ, బూర్ల రామాంజనేయులు, బి. జయనాగేశ్వర్ రెడ్డి, కొల్లా లలిత కుమారి, శ్రీ రాజగోపాల్ శ్రీరామ్, శ్రీ రామాంజనేయులు పులపర్తి, విష్ణుకుమార్ రాజు పెన్మెత్స, అశోక్ రెడ్డి ముతుముల.
అంచనాల కమిటీ సభ్యులు
జయకృష్ణ నిమ్మక, అఖిల్ ప్రియ భూమా, బండారు సత్యానంద రావు, జోగేశ్వరరావు వేగుళ్ల, పార్థసారథి వాల్మీకి, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, పసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు.
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సభ్యులు:
కూన రవికుమార్, కుమార్ రాజా వర్ల, ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన), తెనాలి శ్రావణ్ కుమార్, అయితా బత్తుల ఆనందరావు, ఈశ్వర్ రావు నడికుడిటి, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు