బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – భారత జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత అందుకున్నాడు.ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్గా నిలిచాడు. నిన్న ఆసీస్ ఇన్నింగ్స్ లో భాగంగా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడం ద్వారా 50 బూమ్రా వికెట్లు పూర్తి చేసుకున్నాడు.ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 11 టెస్టులు ఆడిన బుమ్రా 50 వికెట్లు తీశాడు.కాగా ఒక క్యాలెండర్ ఇయర్లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన 3వ భారత పేస్ బౌలర్గా అతడు చరిత్ర సృష్టించాడు.
బుమ్రా కంటే ముందు మాజీ పేసర్లు కపిల్ దేవ్,జహీర్ ఖాన్ ఈ ఘనత అందుకున్నారు.1979లో కపిల్ 17 మ్యాచులు ఆడి 74 వికెట్లు తీశాడు.1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు పడగొట్టాడు.ఇక జహీర్ ఖాన్ 2002లో 15 మ్యాచుల్లో 51 వికెట్లు తీశాడు.హిమ్మత్లాల్ మన్కడ్,బీఎస్ చంద్రశేఖర్,అనిల్ కుంబ్లే,హర్భజన్ సింగ్,రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకే క్యాలెండర్ ఇయర్లో 50 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు.అయితే వీరందరూ స్పిన్ బౌలర్లు కావడం విశేషం.