నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది.సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది.తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ…అల్లు అర్జున్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోందని…హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలని కోర్టును బన్నీ తరపు లాయర్లు కోరారు.వారి విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది.
కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో అల్లు అర్జున్ పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న మేరా హైకోర్టు తీర్పు వచ్చాకే రిమాండ్ పై స్పష్టత రానుంది.అయితే హైకోర్టులోనూ అల్లు అర్జున్ కు చుక్కెదురైతే…కోర్టు మెయిన్ గేటు నుండి కాకుండా, వెనక గేటు నుండి బన్నీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.చంచల్ గూడ జైలు వద్ద కూడా పోలీసు బందోబస్తును పెంచినట్లు సమాచారం.