బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్టు ముగిసిన తర్వాత సీనియర్ ఆటగాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, అతని స్థానంలో భారత జట్టు ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకుంది. ముంబయి ఆఫీస్పిన్నర్ తనుష్ కోటియన్ ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. 26 ఏళ్ల కోటియన్ భారత్-ఎ జట్టు సభ్యుడిగా గత నెలే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆ సిరీస్ ముగిసిన అనంతరం భారత్ కు వచ్చి ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. 26న బాక్సింగ్ డే టెస్టు ఆరంభానికి ముందే జట్టుతో కలవనున్నాడు. కోటియన్ ఇప్పటిదాకా 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 101 వికెట్లు తీశాడు. 1525 పరుగులు చేశాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు