దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో సూచీలు నేల చూపులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ లో నమోదిత కంపెనీల విలువ రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.440 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 24 వేల మార్కు దిగువకు చేరింది. సెన్సెక్స్ 765 పాయింట్లు నష్టపోయి 79,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్ల నష్టంతో 24,363 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.71గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, ట్రెంట్, ఐటీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు