సైబర్ నేరాలు అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏపీలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా నేరస్థుల బారిన పడకుండా జాగ్రత్తపడేలా చూస్తున్నామని అన్నారు. ఇటీవల చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ ను ఏర్పాటుచేసి వాటిని నియంత్రిస్తున్నట్లు వివరించారు. సాంకేతికత సాయంతో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు