బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని విస్తరించనున్నామని హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని వెల్లడించారు.అయితే తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలోని పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలకృష్ణ తెలిపారు.కాగా ఈరోజు హైదరాబాద్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ను ప్రారంభించారు.క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని బాలకృష్ణ అన్నారు.
ఏపీలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభిస్తాం :- ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
By admin1 Min Read