నేడు మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందాం.
మంత్రి నారా లోకేష్:
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారు. ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగడించారు. శాస్త్రవేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. తనదైన వ్యక్తిత్వం, ప్రసంగాలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపారు. వారి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం.
Previous Articleమాంచెస్టర్ టెస్టు: ఇంగ్లాండ్ భారీ స్కోరు…పోరాడుతున్న భారత్
Next Article గంగైకొండ చోళపురం ఆలయాన్ని దర్శించుకున్న ప్రధాని మోడీ