వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో రూ.1.29లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి రవికుమార్ విమర్శించారు. పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా అప్పటి ప్రభుత్వం వినలేదని దీని వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్తాయన్నా పట్టించుకోలేదని విమర్శించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ మాట్లాడారు. విద్యుత్ వ్యవస్థను తిరిగి సరైన దారిలో పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్
By admin1 Min Read