కర్నూలులో ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి సంవత్సరంన్నర పట్టొచ్చు అని లోకాయుక్త, హెన్ఆర్సీ కార్యాలయాలూ కర్నూలులోనే ఉంటాయన్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వైసీపీ న్యాయరాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అసెంబ్లీలో ప్రకటనకు ముందే బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. కర్నూలు నుండి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమేనని తెలిపారు.
Previous Articleస్థిరంగా కొనసాగుతోన్న తీవ్రవాయుగుండం
Next Article భారీ నష్టాలతో సూచీలు నేల చూపులు..!