రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసానగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో మంత్రి మనోహర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగొళ్లలో సమస్యలపై రైతులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటూ ఇటూగా ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రంలోపు రైతులు సిద్ధం చేసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: మంత్రి నాదెండ్ల మనోహర్
By admin1 Min Read
Previous Articleమహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్
Next Article పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ హీరో…!