కొత్త చిత్రాల ఎంపికలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్గా ఉంటుంది.ఆమె కథలో కొత్తదనంతో ఉంటేనే అంగీకరిస్తుంది.అందుకే సాయి పల్లవి ఒప్పుకునే సినిమాల గురించి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు.ఈ నేపథ్యంలో సాయిపల్లవి తెలుగులో మరో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.దర్శకుడు వేణు యెల్దండి ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు.ఆయన తన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు.ఇందులో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని = దిల్రాజు నిర్మించనున్నారు.
ఈ చిత్రం తెలంగాణ నేపథ్య కథాంశంతో తెరకెక్కబోతుంది అని సమాచారం.ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది.ఈ కథ సాయిపల్లవికి బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించిందని సమాచారం. అయితే ఈ చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ప్రస్తుతం నాగచైతన్యకు జోడిగా సాయిపల్లవి ‘తండేల్’ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకానుంది.అనంతరం ‘ఎల్లమ్మ’ చిత్రం పట్టాలెక్కుతుందని తెలుస్తుంది.