విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనని విమర్శించారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీ గారికి ఆంధ్రుల హక్కు మీద లేదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ కు సంబంధించి ఆమె కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి HD కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించారని స్టీల్ ప్లాంట్ ను బ్రతికించారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదని విమర్శించారు . ఇద్దరు ఎంపీలు ఉండే JD(S) రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. ఎన్డీయే కు ఊపిరి పోసిన టీడీపీ- జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయని 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది నిజంగా సిగ్గు చేటు. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారు. కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కార్మికులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే… సీఎం చంద్రబాబు మోడీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడలట. ఇదెక్కడి న్యాయం ? అని ప్రశ్నించారు.
కర్ణాటక స్టీల్ ప్లాంట్ మాదిరిగా వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలి. ప్లాంట్ ను SAILలో వెంటనే విలీనం చేయాలని స్పష్టం చేశారు. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలని భవిష్యత్ లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే ఎన్డీయే భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేనలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin2 Mins Read
Previous Articleఎల్లమ్మగా సాయి పల్లవి …?
Next Article మందకొడిగా ట్రేడింగ్ ముగించిన సూచీలు