మోహన్బాబు,మనోజ్ పరస్పర ఫిర్యాదులతో మంచు కుటుంబంలోని గొడవలు బహిర్గతం అయ్యాయి.ప్రస్తుతం ఇది తీవ్ర చర్చకు దారి తీసింది.మోహన్బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్, ఆయన సతీమణి మౌనికపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.తాజాగా మనోజ్ బహిరంగ లేఖ రాశారు.ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు.తనకు న్యాయం కావాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ట్యాగ్ చేశారు.
‘‘నా (Manchu Manoj)పై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన,తప్పుడు,నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది.మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా,నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిది.నా గొంతు బలంగా వినిపించకుండా, కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిది’’ అని మనోజ్ పేర్కొన్నారు.పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.కుటుంబ విషయాలను ప్రస్తావించారు.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024