అనారోగ్యంతో ఈనెల 26న తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతోఢిల్లీలోని నిగమ్ భోధ్ ఘాట్లో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్జీప్ ధనఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రక్షణా శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాడె మోశారు.
త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బీ.ఆర్.ఎస్ నేత కేటీఆర్ హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మన్మోహన్ పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ గా , ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ పనిచేశారు. ఎన్నో కీలక నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టారు. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితులకు ఆయన తీసుకున్న సంస్కరణలు ఎంతగానో దోహదం చేశాయి.
దేశం మరవదు మీ సేవలు :ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
By admin1 Min Read