బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నది.ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళను ముంబయి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.ముంబయిలో గతంలో అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుడు ఉపయోగించిన సిమ్ సదరు మహిళ పేరుపై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ క్రమంలో బెంగాల్లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఆ తర్వాత సదరు మహిళను అరెస్టు చేశారు.ఆదివారం బెంగాల్కు చేరుకున్న పోలీసులు..సోమవారం అరెస్టు చేశారు.ఖుఖుమోని జహంగీర్ షేక్గా మహిళను గుర్తించగా.. భారత్లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుడు షరీఫుల్ ఫకీర్తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సైఫ్ అలీఖాన్పై ఈ నెల 16న దాడిన జరిగిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఆయనను కుటుంబీకులు లీలావతి ఆసుపత్రికి తరలించగా…చికిత్స తీసుకున్నారు.ప్రస్తుతం కోలుకోవడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు.సైఫ్ దాడి కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
Previous Articleవచ్చే నెలలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన?: ఆహ్వానించిన ట్రంప్
Next Article ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం