భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కు అభినందనలు తెలిపేందుకు భారత ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. మోడీతో ఏం మాట్లాడారని అమెరికా మీడియా ప్రశ్నించగా దీనిపై స్పందించిన ట్రంప్ తనకు మోడీ చిరకాల మిత్రుడని, భారత్ అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మోడీని వైట్ హౌస్ కు ఆహ్వానించినట్లు తెలిపారు. బహుశా వచ్చే నెలలో ఆయన అమెరికా వస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. మోడీ ట్రంప్ లో మధ్య మంచి స్నేహం ఉంది.2020 ఫిబ్రవరిలో ట్రంప్ అహ్మదాబాద్ లో పర్యటించగా.. అంతకు ముందు మోడీ కూడా అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు