గృహ హింస, వేధింపుల చట్టాలు మహిళలకైనా,పురుషులకైనా ఒకే విధంగా ఉండాలని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ కోరారు.అయితే పురుషుల ఆత్మహత్యలపై నిన్న ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2022లో ఆత్మహత్యలతో మరణించిన వారిలో 72 శాతం పురుషులేనని పేర్కొన్నారు.47 వేల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు.
అయితే 2014 నుండి 2021 మధ్య కాలంలో కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న మగవారి సంఖ్య 10 7.5 శాతం పెరిగిందని చెప్పారు.కాగా ‘గృహ హింస, వేధింపుల నుండి మహిళలను కాపాడటంలో మన చట్టాలు పురోగతి సాధించాయని అన్నారు. ఇటువంటి చట్టాలు పురుషులను రక్షించడానికి లేకపోవడమే ఆందోళనకరమని దినేష్ శర్మ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులకు న్యాయపరమైన, భావోద్వేగ మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.