తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని తెలుగు దేశం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు ప్రస్తుతం 47 మంది ఉన్నారు. మునికృష్ణకు 26 మంది ఓటు వేయగా… వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది వేశారు . దీంతో మునికృష్ణ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.
Previous Articleదుల్కర్ సల్మాన్ “కాంత” ఫస్ట్ లుక్ విడుదల
Next Article ఆత్మహత్యల్లో మరణించిన వారిలో పురుషులే అధికం…!