ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీదే అధికారం అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం మొత్తంగా 70 స్థానాలకు గాను 45కు పైగా స్థానాల్లో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఆప్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఈ ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు చేశారు. ‘బీజేపీని మరోసారి గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి అభినందనలు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి 2024 లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను జతచేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క చోట కూడా ముందంజలో లేకపోవడం గమనార్హం.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025