ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.కాగా ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ…ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందనేది ముందే ఊహించిందేనని చెప్పారు.ఢిల్లీ ప్రజలు ఆప్ ను చీపురుతో ఊడ్చేశారని అన్నారు.ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోలుకున్నారని…అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దనుకున్నారని చెప్పారు.మేధావి వర్గం మొత్తం బీజేపీకే ఓటు వేసిందని తెలిపారు.తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ మేధావి, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు.
ఢిల్లీ ఓటర్లు ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు: కేంద్రమంత్రి బండి సంజయ్
By admin1 Min Read