కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏరో – ఇండియా 2025లో యుద్ధ విమానాన్ని నడిపారు.అయితే స్వదేశంలో సగర్వంగా తయారైన HJT-36 యశష్ జెట్ విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పైలట్ రామ్ తో కలిసి ట్రావెల్ చేశారు.ఈ మేరకు యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.ఈ యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ తయారు చేసింది.ఇలాంటి అరుదైన అవకాశం లభించిందని ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా విమానయాన,రక్షణ తయారీలో రోజురోజుకూ పట్టు సాధిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.కాగా ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో…అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం.. మరచిపోలేని అనుభూతినిచ్చింది. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ… pic.twitter.com/0uKdwqRLiE
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) February 11, 2025

