ఎవరో ఒక వ్యక్తి ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులకు పాకిస్థాన్ లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు జో రోగన్ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఆయన ఈ సంచనల వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే పాక్ లో ఫేస్బుక్ పై నమోదైన దావా గురించి వివరించారు.పాడ్ కాస్ట్ లో జుకర్ బర్గ్ మాట్లాడుతూ…ఇతర దేశాల్లో మనం అంగీకరించని చట్టాలు చాలా ఉన్నాయి.ఎవరో ఫేస్బుక్ లో దేవుడిని అవమానిస్తూ ఉన్న ఫొటోలను పోస్టు చేయడంతో పాక్ లో నాకు మరణశిక్ష విధించాలని మరెవరో దావా వేశారు.
అయితే నాకు ఆ దేశానికి వెళ్లాలని లేదు.అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం నాకు లేదు.అనేక దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయి.దీనితో యాప్ లోని చాలా కంటెంట్ను తొలగించాల్సి వస్తోంది.ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా మమ్మల్ని జైల్లో వేసేంత శక్తిమంతంగా చట్టాలు ఉన్నాయి.విదేశాలలో అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలని జుకర్ బర్గ్ కోరారు.