కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఆమె కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టం రానుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు లోక్సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. ఇక 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఖర్చులు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఇప్పుడు బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
కొత్త ఇన్ కం టాక్స్ బిల్లు-2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
By admin1 Min Read
Previous Articleహాను-ప్రభాస్ చిత్రంలో అనుపమ్ ఖేర్: వెల్లడించిన నటుడు
Next Article స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించిన సూచీలు