దేశ రాజధాని ఢిల్లీ మరియు ఆ పరిసర ప్రాంతాలలో నేడు ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం తమ నివాసాల నుండి బయటికి పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణనష్టమేమీ సంభవించకపోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. భయాందోళనలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోడీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండండి: ఢిల్లీ భూకంపం నేపథ్యంలో ప్రధాని మోడీ ట్వీట్
By admin1 Min Read